Pooja Hegde-Prabhas: పూజా హెగ్డే.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. తనదైన టాలెంట్తో టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లోనూ నటిస్తున్న పూజా హెగ్డే.. ఇటీవల `రాధేశ్యామ్`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు కలిసి నిర్మించారు. ఈ వింటేజ్ ప్రేమ కథా చిత్రం మార్చి 11న విడుదలై.. నెగటివ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో గత కొంత కాలం నుంచి వరుస హిట్లతో దూసుకుపోతున్న పూజా హెగ్డేకు రాధేశ్యామ్ రూపంలో పెద్ద ఫ్లాప్ పడింది.
అయితే తాజాగా పూజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అక్కడ `ప్రభాస్తో ఒకవేళ మరో సినిమా చేయాల్సి వస్తే చేస్తారా..?` అని ప్రశ్నించారు. అందుకు ఆమె స్పందిస్తూ.. ఒకవేళ సరైన స్క్రిప్ట్ వస్తే..ఎందుకు సినిమా చేయను. వాస్తవానికి ప్రభాస్తో బాహుబలి 3 సినిమా చేయాలనుందని అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. దీంతో ఇప్పుడీమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.
కాగా, పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఈమె నటించిన `ఆచార్య` విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కబోయే చిత్రంలో హీరోయిన్గా ఫిక్స్ అయిన పూజా.. తమిళంలో దళపతి విజయ్తో `బీస్ట్` చేస్తోంది. ఇక బాలీవుడ్లోనూ ఈ బ్యూటీ మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ను టేకప్ చేసింది.