Pooja Hegde : టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో పూజా హెగ్డే ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.కోలీవుడ్ తలపతి విజయ్ హీరోగా డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఖరారు అయిందని చిత్రబృందం అధికారిక ప్రకటన తెలియజేసింది.
ఇకపోతే ఈ బుట్ట బొమ్మను తమ టీమ్లోకి ఆహ్వానిస్తున్నట్లు తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి 65వ టీమ్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ సినిమా ద్వారా పూజా హెగ్డే దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.కాగా మోడల్గా కెరీర్ని ప్రారంభించిన పూజా హెగ్డే,ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో చేరిపోయారు.
Pooja Hegde పూజా హెగ్డే మూగమూడి :
మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించిన పూజా హెగ్డే మొట్టమొదటిగా తమిళంలో మూగమూడి అనే ఈ సినిమాలో జీవా సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన మేర ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆమెకు తమిళంలో అవకాశాలు రావడం తక్కువ అయ్యాయి.ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పూజా హెగ్డే వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ గా మారిపోయింది.
తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా తొమ్మిది సంవత్సరాలు తిరిగి తమిళ్ లో విజయ్ సరసన నటిస్తూ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈసారైనా ఈ అమ్మడు అక్కడ మంచి విజయాన్ని సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన “రాధేశ్యామ్” చిత్రంలోనూ,అక్కినేని అఖిల్ సరసన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమాల్లోనూ నటిస్తున్నారు.హిందీలో రణ్వీర్ సింగ్ సరసన సర్కస్లో బుట్టబొమ్మ నటిస్తోంది
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!