మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకు వెండితెర టాప్ హీరోయిన్లు కిక్కురుమనకుండా దాదాపు ఐదు నెలల పాటు ఇంటిలోనే దాగి ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిపోవటంతో హీరోయిన్లు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. మరోపక్క దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. ఊహించని రీతిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా ప్రభుత్వాలు ఇటీవల షూటింగులకు అనుమతులు ఇవ్వడం జరిగింది. కానీ హీరోయిన్లు మాత్రం ఇల్లు వదిలి బయట అడుగు పెట్టడానికి తెగ భయపడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో టాప్ హీరోయిన్లకు సవాలుచేస్తూ పూజా హెగ్డే సినిమా షూటింగ్ కి రెడీ అయిపోయింది.
గత కొంత కాలం నుండి ఇండస్ట్రీలో టాప్ ప్రాజెక్టులలో నటిస్తూ చాలామంది దర్శకులకు లక్కీ హీరోయిన్ గా పూజా హెగ్డే మారింది. ఈ ఏడాది ప్రారంభంలోనే అలా వైకుంఠపురం లో సినిమాలో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇటువంటి తరుణంలో కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత అక్కినేని అఖిల్ నటిస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా షూటింగులో పాల్గొనడానికి పూజా హెగ్డే తాజాగా హైదరాబాదులో అడుగుపెట్టింది. దీంతో పూజా హెగ్డే సినిమా షూటింగ్ లకు రెడీ అవటంతో మిగతా టాప్ హీరోయిన్ల పై ఒత్తిడి పెరుగుతోంది.
ఇప్పటికే షూటింగ్ లో పాల్గొని తన స్టాఫ్ తో లొకేషన్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పూజా హెగ్డే అలరిస్తోంది. ఈ దెబ్బతో రకుల్ ప్రీత్ సింగ్, నివేదా థామస్ అదేవిధంగా రష్మిక మందన కూడా త్వరలోనే షూటింగ్ లలో పాల్గొనటానికి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. కాగా ఒక్కసారిగా పూజ హెగ్డే సేట్ లో దర్శనమివ్వటం తో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. గట్స్ ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే అంటూ తొడ గొడుతున్నరు ఫ్యాన్స్. కరోనా తర్వాత కూడా మళ్లీ విజయ పరంపర కొనసాగించాలి పూజ హెగ్డే అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.