Pooja Heghde: టాప్ హీరోయిన్ పూజా హెగ్డే సౌత్ మొదలుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు అనేక అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతుంది. ఇటువంటి తరుణంలో పూజ హెగ్డే ఇటీవల సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమె అందాన్ని మరింత మెరుగుపరుచుకోవటానికి ముక్కు, పెదాలకు కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు రావడం జరిగాయి. అందుకే ఆమె ఇటీవల లండన్ వెళ్లిందన్న ప్రచారం కూడా జరిగింది. ఈ వార్తలపై తాజాగా పూజా హెగ్డే టీం స్పందించింది.
సర్జరీ చేయించుకున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. హాలిడే వెకేషన్ లో భాగంగా మాత్రమే విదేశాలకు వెళ్లడం జరిగిందని తెలిపారు. కొన్ని వారాలపాటు పూజా హెగ్డే విదేశాల వెకేషన్ లో ఉండటం జరిగిందని పేర్కొన్నారు. దీంతో పూజ హెగ్డే సర్జరీ వార్తలకు పులిస్టాప్ పెట్టినట్లు అయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ అనేకమంది దర్శకులకు నిర్మాతలకు బ్లాక్ బస్టర్ లక్కీ హీరోయిన్. అయితే ఈ ఏడాది ఆచార్య, రాధేశ్యాం సినిమాలు ఫ్లాప్ కావడంతో ఐరన్ లెగ్ ముద్ర పడింది. ఇందుకోసమే ఆమె అందానికి మెరుగులు దిద్దుకోవటానికి సర్జరీకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.
కానీ ఆ వార్తలలో వాస్తవం లేదని పూజ హెగ్డే టీం క్లారిటీ ఇవ్వటం విశేషం. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న “SSMB 28″లో హీరోయిన్ గా చేస్తోంది. అంతేకాదు హరిష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కొత్త ప్రాజెక్టు “భగత్ సింగ్ భవదీయుడు” కూడా ఒప్పుకోవటం జరిగింది. ఇంకా పలు బాలీవుడ్ సినిమాలు ఒప్పుకోవడం జరిగింది. ఇటీవలే సౌత్ ఇండస్ట్రీ ప్రతిష్టాత్మక సైమా అవార్డులలో రెండు అవార్డులను పూజా హెగ్డే కైవసం చేసుకోవడం జరిగింది.