Pooja Hegde: `ఒక లైలా కోసం` అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన అందాల భామ పూజా హెగ్డే.. `దువ్వాడ జగన్నాథం`తో తొలి హిట్ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన `రంగస్థలం`లో జిగేలు రాణి అంటూ ఐటెం సాంగ్ చేసి కుర్రకారు ఓ ఊపు ఊపేసింది.
ఆ వెంటనే `అరవింద సమేత వీర రాఘవ` మరో హిట్ పడటంతో.. పూజా హెగ్డే వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస విజయవంతమైన చిత్రాలు చేసి టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న పూజా.. మళ్లీ ఐటెం భామగా మారబోతోందట.
ఇంతకీ ఆమె ఐటెం సాంగ్ చేసేది ఏ సినిమాలోనూ తెలుసా.. `ఎఫ్ 3`. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. 2019లో విడుదలైన ఎఫ్ 2 కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటుంది. అయితే ఈ సాంగ్ కోసం పూజా హెగ్డేను సంప్రదించగా.. అందుకు ఆమె గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. కానీ, ఆ ఐటెం సాంగ్ చేయాలంటే కోటిన్నర రూపాయిలు చెల్లించాలని పూజా డిమాండ్ చేసిందట. దాంతో మేకర్స్ ఆమెతో చర్చలు జరిపి.. చివరాఖరకు రూ. 1 కోటికి ఒప్పించారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.