Pooja Heghde: స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా అడుగుపెట్టిన నాటి నుండి వరుస పెట్టి విజయాలు అందుకుంది. దీంతో చాలామంది దర్శకులకు నిర్మాతలకు లక్కీ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే ఈ ఏడాది ప్రారంభంలో రెండు పరాజయాలు తన ఖాతాలో వేసుకుంది. మొదటిది పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో నటించిన “రాదేష్యం”. రెండవది కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి మరియు చరణ్ నటించిన మల్టీస్టారర్ మూవీ “ఆచార్య”. ఈ రెండు భారీ అంచనాల మధ్య విడుదలయ్యి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజ హెగ్డే బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ తో “కీసి కా భాయి, కీసి కా జాన్” అనే సినిమా చేస్తుంది. ఇటీవలే ఆమె పుట్టినరోజు వేడుకలలో సల్మాన్ ఖాన్ అదేవిధంగా సినిమాలో ప్రత్యేకమైన పాత్ర చేస్తున్న వెంకటేష్ పాల్గొనడం జరిగింది. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో పూజా హెగ్డే గాయాలు పాలయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా పూజ హెగ్డే సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
కాలుకు పట్టి కట్టిన ఫోటోను షేర్ చేస్తూ లెగ్మెంట్ టియ్యార్ అయ్యిందని తెలిపింది. అయితే ఈ గాయం ఎలా అయింది అన్నది క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క సల్మాన్ ఖాన్ తో షూటింగ్ చేస్తున్న సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణలో పూజా హెగ్డేకి ఈ గాయమైనట్లు ప్రచారం జరుగుతుంది. కాలికి చాలా బలమైన గాయం తగలడంతో.. వైద్యులు కొన్ని వారాలు పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో “కిసి కా భాయి కీసీ కా జాన్” షూటింగ్ మరింత ఆలస్యం అయ్యా అవకాశం ఏర్పడింది.