జిల్ జిల్ జిగేలు రాణి అంటూ ‘రంగస్థలం’ స్పెషల్ సాంగ్లో చిందేసిన పూజా హెగ్డేకి హీరోయిన్గా మంచి గిరాకీ ఉంది. కోటిన్నర తగ్గకుండా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఈ సుందరాంగి హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. వరుణ్ తేజ్, అధర్వమురళి, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హరీశ్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 13న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ను హరీశ్ శంకర్ నెమ్మదిగా స్టార్ట్ చేశాడు. సినిమాలో ప్రధాన పాత్రలను పరిచయం చేసే క్యారక్రమానికి హరీశ్ శ్రీకారం చుట్టాడు. ముందుగా పూజా హెగ్డే చేస్తోన్న శ్రీదేవి పాత్ర లుక్ను హరీశ్ రిలీజ్ చేశాడు. గత చిత్రాలకు భిన్నంగా ఈసారి పూజా హెగ్డే విలేజ్ అమ్మాయి పాత్రలో నటిస్తోంది. తమిళ చిత్రం ‘జిగర్ తండా’కు ఇది రీమేక్. చాలా కాలంగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న హరీశ్ శంకర్ వాల్మీకితో సక్సెస్ కొట్టి మళ్లీ తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు.
next post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!