Pooja Hegde: ఇప్పుడు పూజ హెగ్డే హవా కొనసాగుతుందనే చెప్పాలి. ఇటు తెలుగు.. అటు తమిళ్.. మరోవైపు హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించింది పూజ హెగ్డే. ఇటీవలే ‘రాధేశ్యామ్’ తో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ నెల 13వ తేదీన విజయ్ జోడీగా ‘బీస్ట్’తో పలకరించింది. ఇక ‘ఆచార్య‘ సినిమాలో చరణ్ సరసన నీలాంబరి పాత్రలో మెరవనుంది. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న పూజ హెగ్డే, గతంలో ‘రంగస్థలం’ సినిమాలో ఓ ఐటమ్ సాంగుతో మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది. కాగా.. మరోసారి ఈ బుట్టబొమ్మ ఐటమ్ భామగా కనువిందు చేయనుంది. అయితే దీని కోసం పూజ హెగ్డే భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.
Pooja Hegde: స్టార్ హీరోయిన్ల బాటలో పూజ..
స్టార్ హీరోయిన్స్ తమన్నా.. సమంత లు సైతం సైతం ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. వారి బాటలోనే ఇప్పుడు పూజ హెగ్డే కూడా నడవనుంది. “ఎఫ్2” సినిమా కి సీక్వెల్ గా “ఎఫ్ 3” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్.. వరుణ్ తేజ్ లు హీరోలుగా.. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం పూజ హెగ్డేను సంప్రదించగా.. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఐటం సాంగ్ కోసం భారీ పారితోషికం..
కాగా, ఈ సినిమాలో ఐటం సాంగ్ చేయడానికి పూజ ఏకంగా కోటిన్నర పారితోషికం అడిగినట్టు టాక్ వినిపిస్తుంది. భారీ పారితోషికం తీసుకుంటూ పూజా హెగ్డే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మే 27వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. మరోవైపు పవన్-హరీష్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న భవదీయుడు భగత్ సింగ్ మూవీలో కూడా పూజా హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం.