హీరోయిన్ పూజా హెగ్డే అందరికీ సుపరిచితురాలే. అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. అంతేకాదు తెలుగు సినిమా రంగంలో దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో “మహర్షి”, ప్రభాస్ తో “రాదేశ్యమ్”, ఎన్టీయార్ తో “అరవింద సమేత వీర రాఘవ”, రామ్ చరణ్ తో “ఆచార్య”… బన్నీతో “అలా వైకుంఠపురం లో” ఇంకా పలు హీరోలతో సినిమాలు చేయడం జరిగింది. తెలుగులో చాలామంది దర్శకులకు మరియు నిర్మాతలకు పూజా హెగ్డే లక్కీ హీరోయిన్.
పూజ హెగ్డే..కి కూడా ఆ హీరోయిన్ ల గతే పడుతుంది..??
తమిళంలో కూడా పూజా హెగ్డే ప్రముఖ హీరోలతో సినిమాలు చేయడం జరిగింది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మాదిరిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బడా అవకాశాలు అందుకుంటూ ఉంది. సల్మాన్ ఖాన్తో ‘కభీ ఈద్ కభీ దివాళి’ అనే సినిమా రణ్వీర్ సింగ్ సరసన ‘సర్కస్’ సినిమా చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ పై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే ఇటీవల అమితాబ్ తో పూజా హెగ్డే ఒక యాడ్ చేయడం జరిగింది. శీతల పానీయం మాజా యాడ్లో అమితాబ్ మనవరాలిగా నటించింది.
ఈ సందర్భంగా అమితాబ్ లాంటి గొప్ప నటుడితో.. నటించడం నా అదృష్టం. పైగా అయిన మనవరాలిగా..యాడ్ లో చేస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేయడం జరిగింది. అంత వయసులో కూడా.. అమితాబ్ డేడికేషన్… సమయపాలన నాకు ఎంతో నచ్చాయి. నాలాంటి వారికి అమితాబ్ గురువు లాంటి వారు అంటూ.. బుట్ట బొమ్మ తన అభిమానాన్ని చాటుకుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?