దాదాపు రెండు నెలల క్రితం దేశంలో వలస కార్మికులు పడ్డ ఇబ్బందులు గురించి తెలిసిందే. వందల కిలోమీటర్లు నడిచుకుంటూ స్వస్థలాలకు వెళ్లారు. వీరి బాధలు చూసి చలించిపోయిన నటుడు సోనూ సూద్. బస్సులు ఏర్పాటు చేసి వేల సంఖ్యలో కార్మికులను స్వస్థలాలకు చేర్చాడు. దీంతో నేషనల్ హీరో అయిపోయాడు. దీనిపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. సోనూసూద్ కంటే చారిటీ ఎక్కువ చేసిన సినిమా హీరోలు మన తెలుగులో ఉన్నారని అన్నారు. ఓ మీడియా ప్రతినిధి దీనిపై వేసిన ప్రశ్నకి ఆయన స్టైల్లో సమాధానం ఇచ్చారు.
సోనూసూద్ కంటే తెలుగు హీరోలకు సేవా భావం ఎక్కువే..
‘సోనూసూద్ చేసిన చారిటీ మంచిదే. తనకు ఇవ్వాలని పించింది ఇస్తున్నాడు. చేయాలని భావించాడు చేస్తున్నాడు. దేశం అంటే ప్రేమ కావొచ్చు.. ప్రజలంటే ప్రేమ కావొచ్చు. అది తన ఇష్టం. అందులో తప్పు పట్టేది లేదు. కానీ తెలుగు హీరోలు ఇంకా ఎక్కువ చారిటీ చేశారు. సోనూసూద్ కంటే బ్రాడ్ మైండెడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు మనకు ఎక్కువే ఉన్నారుని ఖచ్చితంగా చెప్పగలను. ఎవరూ చెప్పుకోరు అంతే. రూపాయి సాయం చేసి వెనక బోర్డులు పెట్టుకుని చెప్పుకునే వారు చాలా మంది ఉన్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేశ్.. లక్షల్లో, కోట్ల రూపాయల్లో సాయం చేశారు. నేనూ నా పరిధిలో సాయం చేశా.. ఎందుకు చెప్పుకోవడం’ అంటూ సోనూసూద్ ను మెచ్చుకుంటూనే తెలుగు హీరోల గొప్పదనాన్ని కూడా వివరించారు.
సేవల్లో ఎవరి దారి వారిదే..
సాయం కోసం సోనూ సూద్ కు ట్వీట్ వస్తే చాలు సాయం చేస్తున్నాడు. కంప్యూటర్లు, ల్యాప్ టాప్,. ఇంటర్నెట్, ట్రాక్టర్.. ఇలా ఆయన సేవలు ఆయనవే. అలానే.. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు వస్తే ముందుగా స్పందించేది సినీ హీరోలే. వారి స్ఫూర్తితో వారి అభిమానులు కూడా సాయం చేస్తూంటారు. వరదలు, కరోనా.. సమయంలో సాయం చేశారు. ఇవే కాకుండా చిరంజీవి వెలుగులోకి రాని సాయం ఎంత చేసారో మెహర్ రమేశ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్లు చేయించిన ఘనత మహేశ్ కు ఉంది. పవన్ కల్యాణ్ చేస్తున్న సాయం ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఇలా ప్రతిఒక్కరూ తమ పరిథిలో సాయం చేస్తున్నవారే.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!