Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం `రాధేశ్యామ్`. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు కలిసి భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
భారీ అంచనాలు ఉన్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టొరీ అనేక వాయిదాల అనంతరం మార్చి 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్విస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్.. సినిమా గురించి ఎన్నో విషయాలు షేర్ చేశారు.
అలాగే ఈ మూవీలోని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించినప్పుడు ఎంతగానో ఇబ్బంది పడ్డానంటూ కూడా ప్రభాస్ చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. `ఈ మూవీలో కిస్సింగ్ సీన్స్, రొమాంటిక్స్ సీన్స్ కొన్ని ఉన్నాయి. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ. కాబట్టి ఆ సీన్స్ చేయడానికి నేను నో చెప్పలేకపోయాను.
ఇక షర్ట్ తీసేసి పూజా హెగ్డేతో ఓ రొమాంటిక్ సీన్ చేయాలి. అప్పుడు చాలా సిగ్గుగా అనిపించింది.` అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ప్రభాస్ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. కాగా, ఇటలీ బ్యాక్డ్రాప్లో వింటేజ్ ప్రేమ కథా చిత్రంగా రూపుదిద్దుకున్న రాధేశ్యామ్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సత్యరాజ్ కీలక పాత్రలను పోషించగా.. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు.