Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అందులో `సలార్` కూడా ఒకటి. `కేజీఎఫ్`తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిర్గంధూర్ భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటి వరకు మేకర్స్ నుంచి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఈ విషయంపై ప్రభాస్ స్పందించాడు. ప్రస్తుతం ఈయన `రాధేశ్యామ్` ప్రమోషన్స్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు.
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లలో పాల్గొంటూ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ రిపోర్టర్ `సలార్ రెండు భాగాలుగా రాబోతుందా..?` అని నేరుగానే ప్రశ్నించాడు.
అందుకు ప్రభాస్ బదిలిస్తూ.. `దానిపై త్వరలో మేకర్స్ క్లారిటీ ఇస్తారు` అంటూ చెప్పుకొచ్చాడు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నను ఖండించకుండా ప్రభాస్ అలా సమాధానం ఇవ్వడంతో సలార్ రెండు భాగాలుగా రావడం ఖాయమనే ప్రచారం మరింత ఊపందుకుంది. మరి ఇప్పటికైనా సలార్ టీమ్ స్పందిస్తారా..? లేదా..? అన్నది చూడాలి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!