Prabhas Bunny: టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ ప్రభాస్, బన్నీ సొంతం. ప్రభాస్ బాహుబలి 2, బన్నీ “పుష్ప” సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో తమకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అదే తరహాలో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కావటం తెలిసిందే. జనవరి 12వ తారీకు బాలకృష్ణ నటించిన “వీరసింహారెడ్డి”, జనవరి 13వ తారీకు మెగాస్టార్ చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య” రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది.
దీంతో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా ధియేటర్ లకు ఆడియన్స్ పోటెత్తుతున్నారు. ఇదిలా ఉంటే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఏఏంబీ సినిమాస్ లో “వీరసింహరెడ్డి” చూడగా ప్రసాద్ మల్టీప్లెక్స్ లో అల్లు అర్జున్ “వాల్తేరు వీరయ్య” అభిమానులతో చూశారు. ఇద్దరు హీరోలు థియేటర్లలో సందడి చేయడం జరిగింది. ఐకాన్ స్టార్ బన్నీ మొదటి నుండి మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. దీంతో తన సినిమా కాకపోయినా గాని పండుగ సమయంలో థియేటర్ కి వచ్చి చిరంజీవి సినిమా చూడటంతో మెగా ఫాన్స్… బన్నీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షోకి ప్రభాస్ గెస్ట్ గా రావటం తెలిసిందే. ఆ టైంలో బాలయ్యతో ప్రభాస్ ఎంతగానో కలిసిపోయారు. ఇద్దరు కూడా మంచి ఎంజాయ్ చేస్తూ.. షో ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా మార్చడం జరిగింది. దీంతో స్వయంగా బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా చూడాలని ప్రభాస్ కి ఫోన్ చేసి చెప్పినట్లు అందువల్లే వెళ్ళినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ రెండు సినిమాలకు ప్రభాస్ మరియు అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లి చూడటం ఇండస్ట్రీలో సరికొత్త మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసినట్లు అయింది.