పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ మారిన తర్వాత చేస్తున్న సినిమాలకి ఒక్కో దానికి ఏకంగా ఏడాదికిపైగా టైం తీసుకుంటూ ఉన్నాడు. పైగా “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన రెండు సినిమాలు సాహో, రాధేశ్యామ్ ఎక్కువ రోజులు షూటింగ్ టైం తీసుకున్న కానీ ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి. మధ్యలో మహమ్మారి కరోనా రావడంతో రెండు సంవత్సరాల కాలం వృధా అయిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలు చేస్తూ ఉన్నారు.
బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్”, KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలర్”, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “ప్రాజెక్ట్ కే”. ఇదిలా ఉంటే త్వరలో మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని ప్రభాస్ అతి తక్కువ కాలంలో కంప్లీట్ చేయడానికి డిసైడ్ అయినట్లు ఎందుకు గాను కేవలం రెండు షెడ్యూల్లోనే పూర్తి చేస్తానని దర్శకుడు మారుతి కూడా మాట ఇచ్చినట్లు సమాచారం.
దీంతో మారుతి ఈ సినిమాని తాతా-మనవల్ల నేపథ్యంలో.. కామెడీ జోనర్ తరహాలో స్టోరీ సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. పాతపడ్డ థియేటర్ బ్యాక్ డ్రాప్ లో హర్రర్ కామెడీ జానర్ లో ఉండే ఈ మూవీ కోసం హైదరాబాదులో ప్రత్యేకమైన సెట్ కూడా వెయ్యనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందట. ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత తక్కువ కాలంలో ఈ సినిమా షూటింగ్ జరగనున్నట్లు వచ్చే ఆడపిల్లని సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.