Prabhas: నేషనల్ స్టార్ ప్రభాస్కు పోలీసులు షాక్ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ను బ్రేక్ చేయడం వల్ల ఆయనకు భారీ ఫైన్ విధించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు కార్లపై గట్టి నిఘా పెట్టిన సంగతి తెలిసిందే. అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్లను ఆపి.. వాటికి పీకేసి అక్కడికక్కడే ఫైన్లు వేస్తున్నారు.
ఎందుకంటే వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మాత్రమే వీటిని ఉపయోగించేందుకు అర్హులు. ఇంకెవ్వరూ బ్లాక్ ఫిలిం ఉపయోగించడానికి వీల్లేదు. ఈ మేరకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఉల్లంగించిన వారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధింస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, మంచుమనోజ్, త్రివిక్రమ్, అల్లు అర్జున్, నాగ చైతన్య సహా పలువురు ప్రముఖలకు ఫైన్ వేశారు.
ఇక ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది. నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్36లో నీరుస్ కూడలి వద్ద బ్లాక్ ఫ్రేమ్తో వెళ్తున్న కారు పోలీసుల కంటపడింది. కారును ఆపి పరిశీలించగా ఆ కారు ప్రభాస్ది అని తేలింది. అయితే ఈయనకు మాత్రం మూడు ఫైన్లు పడ్డాయి. అందరు సెలబ్రిటీల కార్లలానే ప్రభాస్ కారుకూడా బ్లాక్ ఫిలిం ఉంది.
అలాగే కారు నంబర్ ప్లేటు సరిగ్గా లేదు. పైగా కారుపై ఎంపీ స్టిక్కర్ అతికించి ఉంది. దీంతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రూ. 1450 జరిమానా విధించారు. కాగా, ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన ఓం రౌత్ తో `ఆదిపురుష్`, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో `ప్రాజెక్ట్-కె`, సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` చిత్రాలు చేస్తున్నాడు. వీటితో పాటే మారుతితో ఓ సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!