Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మరికొన్ని రోజుల్లో రొమాంటిక్ లవ్ స్టోరి ‘రాధేశ్యామ్’ తో రాబోతున్నారు. ఆయన నటించిన ‘బాహుబలి’, ‘సాహో’ లాంటి యాక్షన్ సినిమాల తరువాత ఇలాంటి ఓ అద్భుతమైన పీరియాడికల్ రొమాంటిక్ ప్రేమకథా చిత్రంలో నటిస్తుండటం విశేషం. అంతేకాదు ఈ సినిమా ఒప్పుకునేందుకు ఆయనకు చాలా ధైర్యం కావాలి. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా మార్చి 11న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అలాగే, చైనీస్, జపనీస్ భాషలలో విడుదలవుతుంది.
అయితే, ప్రభాస్ లాంటి యాక్షన్ హీరోతో ఇలాంటి రొమాంటిక్ మూవీ తీయాలంటే అది కూడా పాన్ ఇండియా స్థాయిలో నిర్మాతకు ఎన్నో గట్స్ కావాలి. ఆ ధైర్యం చిత్ర నిర్మాత లు వంశీ – ప్రమోద్కు ఉండటం వల్లే ‘రాధేశ్యామ్’ సినిమా రూపు తయారైందని డార్లింగ్ ప్రభాస్ తెలిపారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించగా, తమిళంలో హీరో ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ 175 స్ర్కీన్లలో భారీగా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చెన్నైలో గ్రాండ్గా ప్రమోషన్స్ను నిర్వహించారు.
Prabhas: ఈ సినిమాతో హిట్ ఇచ్చి చెల్లికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నారు.
ఇక ఈ కార్యక్రమంలో హీరో ప్రభాస్, హీరోయిన్ పూజాహెగ్డే, దర్శకుడు రాధాకృష్ణకుమార్, ఎమ్మెల్యే ఉదయనిధి పాల్గొన్నారు. ఇప్పటికే ముంబైలో ప్రమోషన్స్ పూర్తి చేసిన మేకర్స్ .. తాజాగా చెన్నైలోనూ పూర్తి చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. మరి ప్రభాస్ సాహో సినిమాతో అందుకోలేని సక్సెస్ ఈ సినిమాతో దక్కించు కుంటాడో లేదో తెలియాలంటే ఈ నెల 11వరకు ఆగాల్సిదే. ఇక ప్రభాస్ చెల్లి ప్రశీదను ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి దింపాడు ప్రభాస్. ఈ సినిమాతో హిట్ ఇచ్చి చెల్లికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నారు. కాగా, థమన్ ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.