నరసింహ నందమూరి బాలయ్య బాబు “NBK 107” వర్కింగ్ టైటిల్ కలిగిన సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “అఖండ”తో గత ఏడాది బ్లాక్ బస్టర్ విజయం సాధించిన బాలయ్య బాబు ఈ సినిమాతో కూడా విజయం సాధించాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే బాలయ్య బాబు ఇటీవల కరోనా బారిన పడటంతో షూటింగ్ కొన్ని వారాలు కూడా ఆగిపోవడం తెలిసిందే.
దీంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో లెక్కలు మొత్తం తారుమారయ్యాయి. వాస్తవానికి దసరా పండుగ సందర్భంగా విడుదల చేయాలని భావించారు. కానీ మధ్యలో బ్రేక్ రావడంతో ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తారీకు విడుదల చేయాలని నిర్మాతలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అదే రోజు ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో చేస్తున్న “ఆది పురుష్” సినిమా విడుదల కానుంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది.
రామాయణం ఇతిహాస కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ క్రమంలో ఈ సినిమా జనవరి 12 వచ్చేయాడాది విడుదల కానుంది. అదే రోజు బాలయ్య కూడా సినిమా రిలీజ్ చేస్తూ ఉండటంతో వచ్చే కొత్త ఏడాదిలో బాలయ్య మరియు ప్రభాస్ పోటీ పడనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోలు మాత్రమే కాదు వచ్చే సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమా తో పాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే వచ్చే సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బడాబడా స్టార్ హీరోలు పోటీ పడనున్నట్లు తెలుస్తోంది.