Prabhas: ప్రభాస్ అద్భుతమైన నటుడే కాదు.. గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా. కష్టాల్లో ఉన్న వారికి తనవంతు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే ప్రభాస్.. తాజాగా తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ హీరోగా కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్`.
పూజా హెగ్డే ఇందులో హీరోయిన్గా నటించింది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు కలిసి భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం.. మార్చి 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయింది. అయితే సినిమా రిలీజ్ సందర్భంగా గుంటూరు జిల్లాలోని కారంపూడి పల్నాడు ఐమాక్స్ థియేటర్ వద్ద చల్లా కోటేశ్వర రావు(37) అనే అభిమాని ప్రభాస్ ఫ్లెక్సీ కడుతున్నాడు.
అనుకోకుండా అది విరిగి పక్కనే ఉన్న కరెంట్ తీగలపై పడటంతో.. ప్రమాదవశాత్తు కోటేశ్వర రావు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. దీంతో అతడి కుటంబం రోడ్డున పడింది. అయితే ఈ విషయం గురించి తెలుసుకున్న ప్రభాస్.. సదరు అభిమాని కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించాడు.
అలాగే ఆ కుటుంబానికి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటానని భరోసా ఇచ్చాడు. దీంతో ప్రభాస్పై నెటిజన్లు మరియు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రీల్గానే కాదు రీయల్గా కూడా ప్రభాస్ హీరోనే అంటే ఆయన్ను పొగిడేస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!