Prabhas: నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా తాత్కాలికంగా ‘ప్రాజెక్ట్ K’ పేరుతో తెరెకెక్కుతోంది. బాహుబలి తరువాత వచ్చిన సాహో, ఇటీవల రిలీజైన రాధే శ్యామ్ అంతగా ఆడకపోవడం వలన నాగ్ అశ్విన్ సినిమాపైనే ప్రభాస్ అభిమానులు భారీ ఆశలు పెంచుకున్నారు. అందువలన ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విషయమై చిత్ర యూనిట్ ఎలాంటి అప్ డేట్స్ రాకపోడంతో కాస్త అసహనానికి గురయ్యారు. ఏడాది చివరి నాటికి సినిమాను రిలీజ్ చేసే ఉద్దేశంతో, నాగ్ అశ్విన్ సైలెంట్గా తన పని తాను చేసుకుపోతున్నాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అభిమాని ప్రశ్న, నాగ్ అశ్విన్ సమాధానం:
మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేడ్స్ రాని తరుణంలో రాధేశ్యామ్ రిలీజ్ తర్వాతే అంటూ నాగ్ అశ్విన్ చేసిన పాత ట్వీట్కు ఓ అభిమాని రిప్లయ్ ఇస్తూ.. ‘అన్నా గుర్తున్నామా?’ అని ఓ అభిమాని ప్రశ్నించాడు. దాంతో అతడి ఉద్దేశం అర్థం చేసుకున్న డైరెక్టర్.. ‘ప్రభాస్ గారి ఇంట్రో బిట్ సహా ఇప్పుడే ఒక షెడ్యూల్ అయ్యింది. ఆయన చాలా కూల్గా కనిపిస్తారు. జూన్ చివరి నుంచి మళ్లీ మొదలుపెడతాం. రిలీజ్ ఆర్డర్లో మనం చివర కదా. అప్డేట్స్ ఇవ్వడానికి ఇంకా టైం ఉంది. కానీ ‘ప్రాజెక్ట్ కే’ కోసం అందరం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం’ అని బదులిచ్చారు. దాంతో ఎట్టకేలకు ప్రభాస్ సినిమా గురించి డైరెక్టర్ అప్డేట్ ఇవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీగా ఫీలవుతున్నారు.
అభిమానుల కౌంటర్ ఎటాక్:
అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ ఇచ్చిన సమాధానానికి ఓ అభిమాని కౌంటర్ ఇస్తూ.. ‘ప్రాణం పెట్టడం ఎందుకు? శ్రద్ధ పెట్టి పని చేయండి!’ అంటూ బదులిచ్చాడు. ఇక ఆ అభిమాని సమాధానానికి సోషల్ మీడియాలో డార్లింగ్ అభిమానులు లైక్స్ కొడుతున్నారు. అతడి ట్వీట్లో ఓ వేదన దాగి ఉందనేది ఎవరికి తెలిసినా తెలియకపోయినా డార్లింగ్ ఫ్యాన్స్కు బాగా తెలుసు. బాహుబలి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదగడంతోపాటు అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫీలయ్యారు. అందుకే ప్రభాస్ తదుపరి సినిమాలు ఎలా ఉంటాయో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.