ప్రభాస్ ఇప్పుడు థ్రిల్ ఫీలవుతున్నాడు. ఆ విషయాన్నే ఆయన ఇన్స్టా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. యువీ క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం `సాహో`. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే నెల 15న విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతోంది. ఇటీవల ఆస్ట్రియాలో జరిగింది. అందులో భాగంగా కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ద్వారా పంచుకున్నారు. గొప్ప అనుభూతి అని అన్నారు. ఇన్స్ బర్క్, టిరోల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ నాయికగా నటించారు. ఇప్పటిదాకా తెలుగు స్క్రీన్పై రాని యాక్షన్ దృశ్యాలను చూడనున్నారు. మూడు భాషల్లో ఏక సమయంలో చిత్రీకరించారు. హిందీలో ప్రభాస్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. తమిళం మీద కూడా ఆయనకు పట్టు ఉంది. అక్కడ కూడా ఆయనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విడుదలకు ఇంకా నెలన్నరే ఉండటంతో ప్రమోషన్లను కూడా డిఫరెంట్గా చేపడుతోంది. ఈ ప్రమోషన్లు ఇప్పటికే కాస్త ఊపందుకున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రమోషన్లు కూడా అదే రకంగా గ్రాండ్ గా ఉంటాయన్నది ఊహకు అందే విషయమే.
previous post
next post