Prabhas: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల పేర్లలో మొదటిగా రాజమౌళి పేరు వినబడుతుంది ఆ తర్వాత “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగుతోంది. “కేజిఎఫ్” రెండు భాగాలలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు.. ఓ రేంజ్ లో ప్రశాంత్ నీల్ తెరకెక్కించడం జరిగింది. “కేజిఎఫ్” యాక్షన్ సన్నివేశాలకు నార్త్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు ప్రతి ఒక్కరూ బాగా కనెక్ట్ అయ్యారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
బాలీవుడ్ ప్రేక్షకులు అయితే “కేజిఎఫ్”రెండు భాగాలకు బ్రహ్మరథం పట్టారు. ఓరేంజ్ హీరో ఎలివేషన్ తో పాటు యాక్షన్ సన్నివేశాలతో చూసే ప్రేక్షకులకి రోమాలు నిక్కబొడుచుకొన్నెలా.. తనదైన శైలిలో “కేజిఎఫ్” నీ చూపించడం జరిగింది. అటువంటి డైరెక్టర్ తో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “సలార్” చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు 30 శాతానికి పైగానే కంప్లీట్ అయింది. సినిమాలో ప్రభాస్ నీ చాలా వైలేంట్ గా ప్రశాంత్ నీల్ చూపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ సన్నివేశాలు హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
ఇదంతా పక్కన పెడితే జూన్ 4వ తారీఖు ప్రశాంత్ నీల్ బర్తడే నేపథ్యంలో ప్రభాస్ భారీ సర్ప్రైజ్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. విషయంలోకి వెళితే కొన్ని కోట్ల విలువ కలిగిన గిఫ్ట్ ప్రభాస్ బర్తడే కానుకగా ప్రశాంత్ నీల్…కి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క ప్రభాస్ మాత్రమే కాదు హీరో యాష్ కూడా.. ప్రశాంత్ నీల్ కి ఖరీదైన బహుమతి బర్త్ డే నాడు ఇచ్చినట్లు ఫిలిం వర్గాలలో టాక్ నడుస్తుంది.