Adipurush: ఈరోజు సాయంత్రం తిరుపతిలో “ఆదిపురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో అమోఘంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిన్న జీయర్ స్వామి హాజరయ్యారు. ప్రభాస్ .. వంటి స్టార్ హీరో ఆదిపురుష్ సినిమా చేయటం పట్ల చిన్న జీయర్ స్వామి ప్రశంసలు వర్షం కురిపించారు. రామాయణం గురించి చెప్పే సినిమాలు ఇంతకుముందు చాలానే వచ్చాయి. కానీ ప్రస్తుత తరం వేరు. ఈ తరానికి మళ్లీ రాముడు కావాలి. ఈ క్రమంలో టెక్నాలజీకి సంబంధించి రాముడు కావాలి. అటువంటి టెక్నాలజీతో కూడిన సినిమాలు ప్రపంచానికి అందించినందుకు సంతోషమని ప్రసంగించారు.
ఇక ప్రభాస్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓ సందర్భంలో చిరంజీవి గారిని కలిసినప్పుడు రామాయణం పై సినిమా తీస్తున్నావా అని అడిగారు. ఆదిపురుష్ లో నటించటం నిజంగా తాను చేసుకున్న అదృష్టమని అన్నారు. కష్టాలని అధిగమించి ఈ సినిమాని పూర్తి చేసాము. దర్శకుడు ఓమ్ రౌత్.. ఈ సినిమా కోసం పడ్డ కష్టాన్ని తన 21 సినీ కెరియర్లో ఏ డైరెక్టర్ పడని కష్టం చూశాను అని ప్రభాస్ చెప్పుకొచ్చారు. ప్రసంగిస్తుండగా పలుమార్లు ప్రభాస్ భావోద్వేగానికి గురయ్యారు. లక్ష్మణుడు పాత్రలో నటించిన సన్నీని ప్రభాస్ పొగడటం జరిగింది. సన్నీ భావోద్వేగానికి గురై ప్రభాస్ నా జీవితాంతం పెద్దన్నయ్య అని అన్నారు. ఆ తర్వాత సీత పాత్ర చేసిన హీరోయిన్ కృతి సన్నన్ గురించి మాట్లాడుతూ… ఈ సినిమాలో సీత పాత్ర కోసం చాలా ఆలోచించడం జరిగింది.
మంచి అమ్మాయినీ తీసుకోవాలని అన్ని రకాలుగా ఆలోచించి కృతినీ ఎంపిక చేసాం. ఈ సినిమా ఫస్ట్ సీత పాత్రకి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశాక…కృతి సనన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఆ కన్నీటి బొట్టు భావోద్వేగం… ఎంతగానో ఆకట్టుకుంది. కృతి చాలా గొప్ప పెద్ద నటి. మన జానకి సినిమాలో అద్భుతంగా నటించింది అంటూ ప్రభాస్ పొగడటం జరిగింది. ఇక హనుమంతుడు పాత్ర చేసిన దేవ్ జీ… మరాఠీలో పెద్ద నటుడు. ఆయనతో సినిమా సీన్స్ చేసినప్పుడు.. తెలియని ఎమోషన్ కి ఫీల్ కావడం జరిగింది. అప్పుడే ఆయనే హనుమంతుడని ఫీలయ్యాను… అదొక కొత్త ఎమోషన్. అటువంటి ఎమోషన్ ఎప్పుడూ కూడా లైఫ్ లో నాకు కలగలేదు అంటూ ప్రభాస్ తనదైన శైలిలో.. ఈ సినిమాలో నటీనటుల గురించి స్పీచ్ ఇవ్వడం జరిగింది.