Prabhas: నేషనల్ స్టార్ ప్రభాస్ బాగా సిగ్గరి అన్న విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా కొత్త వాళ్లతో ఈయన అస్సలు మాట్లాడలేరు. అయితే ఇదే విషయంపై స్పందించిన ప్రభాస్ ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఈయన `రాధేశ్యామ్` ప్రమోషన్స్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న మొత్తం ఐదు భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.
అయితే ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.. కొత్త వాళ్లతో నేను అంత తొందరగా మాట్లాడలేను. ఒకసారి దీపికా పదుకొనే నువ్వు ఎక్కువ మాట్లాడవంట కదా? అని ముఖం మీదే అడగడంతో సిగ్గేసింది. నాకు స్టార్టింగ్ ప్రాబ్లమ్.. కాస్త పరిచయం అయితే ఎక్కువ మాట్లాడతానని ఆమెతో చెప్పాను.
ఇక దీపికా యాటిట్యూడ్ అంటే ఇష్టం, పర్సనల్గా కూడా ఆమెంటే ఎంతో అభిమానం. ఆమెతో కలిసి ప్రస్తుతం ప్రాజెక్ట్-కె మూవీ చేస్తున్నాను` అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి.