Prabhas: నేషనల్ స్టార్ ప్రభాస్ ఇటీవలె `రాధేశ్యామ్`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. దీంతో ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు పెద్ద సినిమాలు ఉన్నాయి.
అందులో `ఆదిపురుష్` షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ప్రభాస్.. ఇటీవల `సలార్` షూట్లో పాల్గొన్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ మూవీ షూట్ను ఇంకా ఫినిష్ చేయకముందే.. ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` చిత్రీకరణలోనూ జాయిన్ అయ్యారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ షూటింగును జరుపుకుంది. పాన్ వరల్డ్ స్టాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం హైదరాబాదులో మూడు భారీ సెట్లు వేశారు.
ఈ మూడు సెట్స్ లోనే మేజర్ పార్టు షూటింగును జరపనున్నారు. ప్రస్తుతం కూడా ఈ సెట్స్ లోనే చిత్రీకరణ జరుగుతుందని.. తాజా షెడ్యూల్లో ప్రభాస్, అమితాబ్, దీపికలపై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికి ప్రభాస్ ఒకేసారి అటు `సలార్` ను, ఇటు `ప్రాజెక్ట్ కె`ను కానిచ్చేస్తూ జోరు చూపిస్తున్నారు.