యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రపంచంలో ఏ దేశంలో కి వెళ్ళిన తనని ఆ ప్రాంత ప్రజలు గుర్తు పడుతున్నారని పలు ఇంటర్వ్యూ లలో కూడా అనేకసార్లు తెలపడం జరిగింది. అటువంటి ప్రభాస్ హైదరాబాద్ నగరంలో తన కారు రిజిస్ట్రేషన్ నిమిత్తం ఆర్ డి ఆఫీస్ కు వస్తే మన వాళ్లు వదులుతారా ఏంటి. ఎగబడి మరీ కరోనా వైరస్ అని లెక్క చేయకుండా ఫోటోలు దిగటానికి తెగ తాపత్రయ పడ్డారు.
చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ పబ్లిక్ లో దర్శనం ఇవ్వడంతో…ఆర్టీవో ఆఫీస్ సిబ్బందితో పాటు అభిమానులు భారీ ఎత్తున సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో సెల్ఫీరాజా తరహాలో ప్రభాస్ ప్రతి అభిమాని తో ఫోటో దిగడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం లో అదే రీతిలో రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమాలు చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఇందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే సినిమా దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ సినిమా అని టాక్. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత కొత్త కారు రిజిస్ట్రేషన్ నిమిత్తం హైదరాబాద్ ఆర్టిఓ ఆఫీస్ కి ప్రభాస్ రావటంతో ఫ్యాన్స్ తో ఫోటోలు దిగటంతో, ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.