బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ “ఆది పురుష్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర పోషిస్తుండగా విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో సీత పాత్రలో ప్రభాస్ పక్కన నటింపజేయడానికి డైరెక్టర్ ఓం రౌత్ అనేక మంది పేర్లు పరిశీలిస్తుండగా ప్రభాస్ పక్కన పొడుగు కాళ్ల సుందరి రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ బాగుంటుందని అనుకుంటున్నారట.
రకుల్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేయటంతో ప్రేక్షకులు అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ ఈజీగా జంటని రిసీవ్ చేసుకుంటారు అనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ “బాహుబలి” కంటే మించి ఉండటంతో టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా పెద్ద హాట్ టాపిక్ అయింది.
త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ “రాధేశ్యాం” అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఇటలీలో షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రభాస్ “ఆది పురుష్” సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట.