Prabhas: భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని పెంచిన సినిమా బాహుబలి. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా దేశంలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. అన్ని ఇండస్ట్రీలలో ఉన్న రికార్డులను బ్రేక్ చేసి కొత్త లెక్కలు సృష్టించింది. ఇప్పటికీ కూడా భారతీయ చలనచిత్ర రంగంలో “బాహుబలి” దే అగ్రస్థానం. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా అవతరించడం జరిగింది.
ఇదిలా ఉంటే ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టులలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “ప్రాజెక్టు కె” ఒకటి. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం. దీంతో హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హైటెక్నాలజీ కలిగిన కెమెరాలతో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ తో పాటు హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తోంది. అయితే ఈ సినిమాని “బాహుబలి” తరహాలో…. రెండు భాగాలుగా విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారట. ఇది 2024వ సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
అయితే మొదటి పార్ట్ వచ్చే ఏడాది వేసవిలో ఆ తర్వాత… డిసెంబర్ నెలలో సెకండ్ భాగం రిలీజ్ చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ కెరియర్ లో ఇది అత్యంత హై బడ్జెట్ మూవీ. దాదాపు సగం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. నాగ్ అశ్విన్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ సైతం తన కెరీర్ లో ఇది కొత్త సబ్జెక్టు కావటంతో చాలా ఇంట్రెస్టింగ్ గా షూటింగ్ లో జాయిన్ అవుతున్నారంట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి కొత్త అప్డేట్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.