ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాధే శ్యాం అన్న టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం పూర్తవగా లాక్ డౌన్ కారణంగా విదేశాలలో జరగాల్సిన షెడ్యూల్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఆ చిత్రీకరణ మొత్తం హైదరాబాద్ లోనే జరపబోతున్నారు. అందుకు భారీ సెట్స్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో నిరించారట. పాన్ ఇండియా కేటగిరీలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా సీనియర్ నటి భాగ్యశ్రీ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక భారీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా అధికారకంగా అనౌన్స్ అయింది. వైజయంతి మూవీస్ సంస్థలో ఈ సినిమాని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా వైజయంతి మూవీస్ సంస్థకి 50 వ సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగ్ అశ్విన్ ఈ సినిమాని మూడవ ప్రపంచ యుద్ధం ఆధారంగా చేసుకొని అందులో ఒక ముఖ్యమైన అంశం స్పూర్తితో స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తారని అంటున్నారు. 2021 ప్రారంభం లో ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టి 2022 లో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట చిత్ర బృందం.