Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన సినిమా విషయంలో ప్లానింగ్ మార్చినట్టు తెలుస్తోంది. వాస్తవంగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను మొదలుపెట్టి నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని భావించాడు. అయితే, ఇప్పుడు అలా కాకుండా ముందు సలార్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ మార్చినట్టు తెలుస్తోంది. ఇక తాజా సమాచారం మేరకు ఇటీవల కాస్త రెస్ట్ తీసుకున్న వచ్చే వారం నుంచి పాన్ వరల్డ్ సినిమా ‘ప్రాజెక్ట్ -కె’ షూట్ లో పాల్గొంటారట.
దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ మీద కీలక సన్నివేశాలను తెరకెక్కించేందు షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందట. ఇక ఇప్పటికే సినిమాకి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అమితాబచ్చన్.. దీపికా పదుకొణే.. ప్రభాస్ సహా ఇతర ముఖ్య తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేశారు. కాగా, మే నుంచి ‘సలార్’ షూటింగ్ లో జాయిన్ కానున్నారట.
Prabhas: సలార్ మూవీ, మారుతీ మూవీ ఈ ఏడాది పూర్తి ..
మే నెలలో మొత్తం రెండు షెడ్యూల్స్ పూర్తిచేయాలని పక్కాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేజీఎఫ్ 2 సక్సెస్ మూడ్లో ఉన్న ప్రశాంత్ నీల్ డబుల్ ఎనర్జీతో సలార్ షెడ్యూల్స్ కంప్లీట్ చేయనున్నారు. ఈ గ్యాప్లోనే నాగ్ అశ్విన్ కోసం ప్రభాస్ డేట్స్ సర్దుబాటు చేశారట. ఈ రెండు సినిమాలతో పాటు మారుతి దర్శకత్వం లో ‘డీలక్స్ రాజా’ కూడా సెట్స్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సలార్ మూవీ, మారుతీ మూవీ ఈ ఏడాది పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ లోపు బాలీవుడ్లో సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాను పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ప్రభాస్ – సందీప్ రెడ్డిల స్పిరిట్ షూటింగ్ మొదలవబో తుంది.