Prabhas: ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా దక్షిణాది సినిమాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలు కూడా దక్షిణాది దర్శకులు సినిమాలకు ఎక్కువగా పెద్దపీట వేస్తూ వాళ్లతో చేస్తున్నారు. ఇదిలా ఉంటే తమిళంలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అందరికీ సుపరిచితుడే. కార్తీతో “ఖైదీ” మరియు కమలహాసన్ తో “విక్రమ్” సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ విజయలతో మంచి గుర్తింపు సాధించడం తెలిసిందే. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా లోకేష్ కనగరాజ్ పేరు మారుమొగుతుంది.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్…లోకేష్ కనగరాజ్ తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. భారీ యాక్షన్ చిత్రంగా… ఈ సినిమా తెరాకెక్కనున్నట్లు…వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాతో ఇప్పుడు ఐదు ప్రాజెక్టులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది నుండి రెండు సినిమాలు రిలీజ్ చేయాలని ప్రభాస్ ప్లాన్ చేసినట్లు… ఈ క్రమంలో లోకేష్ సినిమా ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్” కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. కొద్దిపాటి బ్యాలెన్స్ వర్క్ ఉన్న “ఆదిపురుష్”… జనవరిలో విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు జూన్ నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్” విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత లోకేష్ సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.