Radhe shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ ‘రాధేశ్యామ్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ శుక్రవారం భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. గత ఏడాది నుంచి ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో వస్తుందా? అని అభిమానులు, ప్రేక్షకులు ‘రాధేశ్యామ్’ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సిరీస్, సాహో వంటి యాక్షన్ చిత్రాల తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న కంప్లీట్ రొమాంటిక్ సినిమా ‘రాధేశ్యామ్’. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటించడంతో మరింతగా అంచనాలు పెరిగాయి.
ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఇటలీ, యూరప్ నేపథ్యంలో ఓ వింటేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించారు. కాగా, ఈ సినిమా రిలీజ్ కు ముందే థియేట్రికల్ రైట్స్ పరంగా రికార్డు లు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు థియేట్రికల్ బిజినెస్ పరంగా ‘రాధేశ్యామ్’ రూ 200 కోట్లు రాబట్టిందని సమాచారం.
Radhe shyam: మిగతా భాషల్లో మాత్రం అంతగా క్రేజ్ కనిపించడం లేదట.
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా మొదలయ్యాయి. ఈ రకంగా కూడా ‘రాధేశ్యామ్’ సంచలనం సృష్టిస్తోందని తెలుస్తోంది. తాజాగా తెలంగాణాలో 5వ షోకు ప్రభుత్వం అనుమతిని చ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నా యని చెప్పుకుంటున్నారు. అయితే ఇది ఒక్క తెలుగులోనే అని తెలుస్తోంది. మిగతా భాషల్లో మాత్రం అంతగా క్రేజ్ కనిపించడం లేదట. అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాలు బాలీవుడ్ తో పోలిస్తే ఇతర రాష్ట్రాల్లో మాత్రం నెమ్మదిగానే సాగుతున్నాయంటు న్నారు.