Prabhas: నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కబోతోందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే వరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. ఈ ప్రాజెక్ట్ ఖాయమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఇందులో ప్రభాస్కు జోడీగా ముగ్గురు హీరోయిన్లు మెరవబోతున్నారని తెలుస్తుండగా.. ఇప్పటికే కృతి శెట్టి, మాళవిక మోహనన్లను ఫైనల్ చేశారని అంటున్నారు. ఇకపోతే మాస్ మసాలా ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమాకు ప్రభాస్ అందుకున్న రెమ్యునరేషన్ ఆసక్తికరంగా మారింది.
మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ 60 రోజుల కాల్షీట్లు ఇచ్చారట. అయితే అందుకుగానూ ఆయన రూ. 75 కోట్లు డిమాండ్ చేశాడు. ప్రభాస్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా దానయ్య సైతం అంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఓకే చెప్పారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలి. కాగా, ప్రభాస్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో `సలార్`, ఓం రౌత్తో `ఆదిపురుష్`, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కె` చిత్రాలు చేస్తున్నారు. వీటిలో ఆదిపురుష్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కాగా.. మిగిలిన రెండూ సెట్స్ మీదే ఉన్నాయి. ఇక వీటి తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` అనే మూవీ చేయాల్సి ఉంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!