Radhey Shyam: ప్రభాస్, పూజ హెగ్డే జంటగా తెరకెక్కిన “రాధేశ్యాం” సినిమా ఈ నెల 11 వ తారీకు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మహమ్మారి కరోనా కారణంగా అనేకమార్లు సినిమా వాయిదా పడుతూ వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అంతమాత్రమే కాకుండా సినిమాకి సంబంధించి రిలీజ్ వేడుక కూడా జనవరిలోనే చేయడం జరిగింది. కానీ ఊహించని విధంగా మహమ్మారి కరోనా కేసులు పెరగటంతో… సినిమా వాయిదా పడింది. అయితే మరి కొద్ది రోజుల్లో సినిమా విడుదల కానున్న తరుణంలో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చిత్ర యూనిట్ హోరేతిస్తోంది.
సినిమా యూనిట్ వరస ఇంటర్వ్యూ లతో సందడి చేస్తూ ఉన్నారు. బాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకు ఒరిస్సా ఇంటర్వ్యూల తో పూజా హెగ్డే మరియు ప్రభాస్ సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా ఇంటర్వ్యూలో ప్రభాస్… సీనియర్ రెబల్ స్టార్ పెదనాన్న కృష్ణం రాజు.. పాత్ర గురించి సరికొత్త విషయాలు తెలియజేశారు. కొన్ని సన్నివేశాలలో ఇద్దరం కనిపించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఆయన పాత్ర పేరు పరమహంస అని.. చాలా బాగా యాక్ట్ చేశారు అని కొనియాడారు. ఈ సినిమాలో తన కి గురువు పాత్రలో కృష్ణంరాజు నటించినట్లు ప్రభాస్ స్పష్టం చేశారు. ఇదిలావుంటే కృష్ణంరాజు పాత్రను హిందీలో సత్యరాజ్ పోషించటం జరిగింది. మరోపక్క సినిమాలో కృష్ణంరాజు ఉండటంతో డార్లింగ్ అభిమానులు కొద్దిగా కంగారు పడుతున్నారు. మేటర్ లోకి వెళ్తే ప్రభాస్ నటించిన.. రెబల్, బిల్లా సినిమాలో కృష్ణంరాజు ఉండటంతో అవి ఫెయిల్ అవ్వటంతో… రాదృశ్యం రిజల్ట్ ఎలా ఉంటుందో అని కంగారు పడుతున్నారు.