యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యు.వి.క్రియేషన్స్ బ్యానర్పై సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ `సాహో`. `బాహుబలి` తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సినిమా ఇదే కావడంతో.. సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా వాయిదా పడింది. సినిమా ఆలస్యంపై అధికారిక ప్రకటన రాలేదు కానీ.. శర్వానంద్ `రణరంగం`, అడివిశేష్ `ఎవరు` సినిమాలు ఆగస్ట్ 15న విడుదలవుతాయని అధికారిక ప్రకటన వెలువడటంతో `సాహో` వాయిదా పడట్టేనని అందరూ ఓ నిర్ణయానికొచ్చేశారు.
సినీ వర్గాల సమాచారం ప్రకారం `సాహో` పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడానికి సమయం పట్టేలా ఉంది. అవసరావసరంగా పనులు చేయడంతో ఔట్పుట్పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి.. హిందీలో సినిమాను విడుదల చేస్తున్న టి సిరీస్ సహా నిర్మాతలు సినిమా విడుదల వాయిదా వేద్దామని అనుకుని వాయిదా వేశారు. అయితే తదుపరి సినిమా విడుదల తేదీపై ఇంకా ప్రకటన రాలేదు.
previous post
next post