Prabhas: ప్రభాస్ పేరు ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే గట్టిగా వినబడేది. కానీ ఎప్పుడైతే “బాహుబలి” రిలీజ్ అయ్యిందో.. ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ ప్రభాస్ పేరు డబల్..త్రిబుల్ గా వినబడుతోంది. “బాహుబలి” విజయంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్.. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో “రాధేశ్యాం”, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” చేస్తున్న సంగతి తెలిసిందే. “కేజిఎఫ్” లాంటి భారీ బ్లాక్ బస్టర్ తీయటం తో పాటు ఇప్పుడు ప్రభాస్ చేత ‘సలార్’ లో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఏ విధంగా చూపిస్తాడో అన్నా ఆతృతతో పాటు సినిమాపై.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తి కావటం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో.. కరోనా ఉద్రిక్తత తగ్గిన వెంటనే ‘సలార్’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుందట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ ని డబల్ యాక్షన్ రోల్ లో ప్రశాంత్ నీల్ చూపిస్తున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. సినిమాలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ప్రభాస్ ది అని అంటున్నారు ఫిల్మ్ మేకర్స్.
ఈ పరిణామంతో ప్రభాస్ లుక్ పూర్తిగా మార్చడం కోసం హై ప్రొఫెషనల్ ప్రోస్తెటిక్, మేకప్ బృందాన్ని సినిమా యూనిట్ రంగంలో దించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన మొదటి పోస్టర్ సినిమాపై మాస్ అంచనాలను పెంచడం మాత్రమే కాక మాస్ ప్రేక్షకులు బాగా ఆకట్టుకోవడం జరిగింది. వచ్చే ఏడాదిలో ఏప్రిల్ 14 వ తారీకు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయటంతో.. సినిమా షూటింగ్ శరవేగంగా జరిపించే రీతిగా సినిమా యూనిట్ పక్కా షెడ్యూల్ ప్రణాళికలతో ఉన్నట్లు సమాచారం.