Prabhas – Sharwanand: మళ్ళీ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సందడి మొదలైంది. గత రెండేళ్ళుగా తమ అభిమాన హీరోల సినిమాలు థియేటర్స్లో రిలీజ్ కాకపోవడంతో అభిమానులు అలాగే ప్రేక్షకులు తీవ్ర నిరాశ చెందిన సంగతి తెలిసిందే. మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత నుంచి అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలు గత ఏడాది బాక్సాఫీస్ వద్ద దిగి భారీ హిట్స్ అందుకున్నాయి. దాంతో మేకర్స్ అందరూ తమ సినిమాలను రిలీజ్ చేయాలని డిసైడయ్యారు. కానీ, థర్డ్ వేవ్ వచ్చి చిన్నా భిన్నం చేసింది. సంక్రాంతికి రావాల్సిన సినిమాలన్ని మళ్ళీ పోస్ట్పోన్ అయ్యాయి.
ఎట్టకేలకు పరిస్థితులు చక్కబడటంతో పవన్ కళ్యాణ్, రానా నటించిన భీమ్లా నాయక్ సినిమాను తీసుకువచ్చారు. ఈ సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకు రావడమే కాకుండా చిన్నా, మీడియం బడ్జెట్, పాన్ ఇండియన్ సినిమాలను రిలీజ్ చేసేయొచ్చనే ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించింది. దాంతో ఈ నెల 4వ తేదీన యంగ్ హీరో శర్వానంద్ నటించిన ఆడవాళ్ళు మీకు జోహార్లు, ప్రభాస్ – పూజా హెగ్డే నటించిన పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యామ్ సినిమాను ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
Prabhas – Sharwanand: అమితమైన అభిమానంతో కాదనలేక వాయిస్ ఓవర్ ఇచ్చారట.
ఈ నేపథ్యంలో ఆయా చిత్ర దర్శక, నిర్మాతలు భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభాస్ పట్టుపట్టి తనకు పాన్ ఇండియన్ స్టార్ క్రేజ్ ఇచ్చిన దర్శకుడు రాజమౌళితో రాధే శ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పించారట. ఇది సినిమాకు బాగా హెల్ప్ అవుతుందని చెప్పుకుంటున్నారు. ఇక శర్వానంద్ – రష్మిక మందన్న జంటగా నటించిన ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రానికి మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ ఇద్దరు హీరోలు పట్టుపట్టి తమ సినిమాలకు ఈ స్టార్ డైరెక్టర్స్తో వాయిస్ చెప్పించుకున్నారట. వారు కూడా తమ హీరోల మీద ఉన్న
అమితమైన అభిమానంతో కాదనలేక వాయిస్ ఓవర్ ఇచ్చారట. ఇద్దరిది మంచి బేస్ వాయిస్ కావడంతో కథ నరేట్ చేసే విధానం బాగా ఉంటుందని చెప్పుకుంటున్నారు.