Prabhas: ఇండియాలో ప్రభాస్ తో సినిమా చేయాలని అనేక ఇండస్ట్రీలకి చెందిన డైరెక్టర్లు నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు. బాహుబలి విజయంతో అంతర్జాతీయ స్థాయిలో తన మార్కెట్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్… పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఒకానొక టైంలో టాలీవుడ్ కే పరిమితమైన ప్రభాస్ క్రేజ్.. ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో వ్యాపించింది. దీనంతటికీ కారణం బాహుబలి సినిమా. ఈ సినిమా తరువాత ప్రభాస్ తన మార్కెట్ కి తగ్గ విధంగానే సినిమాలు ఒప్పుకుంటున్నాడు.
ఎక్కువగా పాన్ ఇండియా తరహాలోనే.. స్టోరీ లు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ కోసం చాలా మంది డైరెక్టర్లు వెయిట్ చేస్తూ ఉండగా… ప్రభాస్ మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాప్ మోస్ట్ డైరెక్టర్ తో పనిచేయటానికి… ఇటీవల బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో మరియు మీడియాలో వైరల్ అవుతుంది.
విషయంలోకి వెళితే త్రీ ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ రాజు హిరానీ తో సినిమా చేయాలని ప్రభాస్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం ఇప్పటికే రాజు హిరానీ కి తెలియజేసినట్లు… ఓకే చెప్పినట్లు త్వరలోనే ఓ స్టోరీ వినిపించడానికి కూడా రెడీ అవుతున్నట్లు టాక్. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యాం, కేజిఎఫ్ డైరెక్టర్ తో “సలర్” సినిమా చేస్తున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ లో “ఆది పురుష్”… డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో సినిమా తర్వాత.. ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?