Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్, పూజా హెగ్డే నటించిన తాజా చిత్రం ‘రాధే శ్యామ్’ త్వరలో ప్రపంచ వ్యాప్తంగా 7 భాషలలో విడుదల కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. రొమాంటిక్ హీరోగా ప్రభాస్ ను చూసి ఎన్నో ఏళ్లు అయింది. ఇప్పుడు ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక దీని తరువాత సినిమాలుగా ‘సలార్’, ‘ఆది పురుష్’ ప్రభాస్ నుంచి రాబోతున్నాయి. బాలీవుడ్ స్ట్రైట్ పౌరాణిక చిత్రమైన ‘ఆది పురుష్’ షూటింగ్ను ఇటీవల పూర్తిచేశారు ప్రభాస్.
ఇక ‘సలార్’ షూటింగ్ కూడా చివరి దశకి చేరుకుంది. తరువాత ‘ప్రాజెక్టు కే’ ను కూడా ఇటీవల ప్రభాస్ సెట్స్ మీదకు తీసుకువచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ 50వ సినిమాగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగులో అమితాబ్, దీపిక పదుకొనే కూడా పాల్గొన్నారు. కాగా, తాజాగా కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలై శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొంటున్నారు.
Prabhas: హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాకు యాక్షన్ సీక్వెన్స్
ఇప్పుడు ఇద్దరిపై కీలక సన్నివేశాలను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదే షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ యాక్షన్ సీన్స్ కోసం ప్రభాస్ ఫేమస్ యాక్షన్ కొరియో గ్రాఫర్ పర్వేజ్ షేక్ ను తీసుకొచ్చారట. హిందీలో రూపొందుతున్న ‘బ్రహ్మాస్త్ర’ సహా పలు బాలీవుడ్ సినిమాలకు ఆయన యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. బాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలకు భారీ బడ్జెట్తో యాక్షన్ సినిమాలకి పనిచేశారు. ఇప్పుడు ప్రాజెక్ట్కు ప్రభాస్ అవకాశం ఇవ్వడంతో ఆయన హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాకు యాక్షన్ సీక్వెన్స్ను కంపోజ్ చేస్తున్నారట. ఈ మూవీకి ఈ యాక్షన్ హైలెట్గా నిలవనున్నాయట.