Prabhas : “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. “బాహుబలి” రాకముందు వరకు కేవలం ప్రభాస్ పేరు తెలుగు ఆడియన్స్ మాత్రమే తెలిసి ఉండేది. కానీ తర్వాత “బాహుబలి” దెబ్బకు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో డార్లింగ్ పేరు మారుమ్రోగుతోంది. టాలీవుడ్ లో ఉండే మార్కెట్ ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో పెరగడంతో… ఇండియన్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా డార్లింగ్ ప్రభాస్ మారిపోయాడు.
ఏకంగా ఇటీవల హైదరాబాద్ పర్యటన చేపట్టిన భారత ప్రధాని మోడీ.. టాలీవుడ్ ఇండస్ట్రీ గొప్పదనాన్ని చాటడానికి గల ప్రధాన కారణం అని చెప్పవచ్చు. “బాహుబలి” దెబ్బకు ఇప్పుడు టాలీవుడ్ పేరు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో డబుల్ త్రిబుల్ గా వినబడుతుంది. ఇక ఇదే క్రమంలో తనకున్న మార్కెట్ పార్టీ ప్రభాస్ కూడా ఆ రీతిగానే సినిమాలు ఒప్పుకుంటున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం లో టైటిల్ గా ప్రాజెక్టు కే అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు ఫస్ట్ టైం దీపికా పదుకొనే అదే విధంగా కీలకమైన పాత్రలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడు. మామూలుగానే సినిమాలు చాలా స్లోగా ప్రభాస్ చేస్తుంటాడు అన్న టాక్ ఉన్న సమయంలో.. కరోనా కారణంగా దాదాపు మూడు సంవత్సరాల పాటు.. ప్రభాస్ సినిమా రిలీజ్ కాని పరిస్థితి. కాని వచ్చే వేసవిలో “రాదేశ్యం” విడుదలవుతోంది. ఇటువంటి సమయంలో వచ్చిన గ్యాప్ ఏమాత్రం పెరగకుండా డార్లింగ్ స్పీడు పెంచేశాడు. ప్రాజెక్ట్ కే సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేసేసాడు. ఈ వారంలోనే సినిమాకి సంబంధించి పది రోజుల షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొన్నబోతున్నాడు అనే టాక్ నడుస్తోంది. టాలీవుడ్ బ్యానర్ వైజయంతి మూవీస్ పతాకంలో 50వ సినిమాగా తెరకెక్కుతున్న నేపథ్యంలో నిర్మాత అశ్వినీదత్ ఈ ప్రాజెక్టుని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!