“బాహుబలి” సినిమా తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పర్ఫెక్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ కి బాహుబలి భారీ విజయంతో మార్కెట్ దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ స్థాయిలో ఉండటంతో…. అన్నీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లు ప్రభాస్ కోసం సినిమా చేయడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాదే శ్యాం, ఆది పురుష్ అనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ అనే బాలీవుడ్ డైరెక్టర్ తీస్తున్న “ఆదిపురుష్” సినిమా అయితే భారీ బడ్జెట్ సినిమా.
ఇటువంటి తరుణంలో ప్రభాస్ దగ్గరికి “కేజిఎఫ్” లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇటీవల స్టోరీ వినిపించారట. స్టోరీ పక్కా మాస్ మసాలా జోనర్ లో ఉండటంతో ప్రభాస్ స్టోరీ విని కంప్లీట్ గా మెస్మరైజ్ అయినట్లు సమాచారం. దీంతో ఎన్ని పెద్ద సినిమాలు ఉన్న అన్ని పక్కన పెట్టి నెక్స్ట్ వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు సమాచారం.
నెక్స్ట్ ఆదిపురుశ్, నాగ అశ్విన్ సినిమాల కంటే ముందుగానే ఈ సినిమా స్టార్ట్ కానుందని ఇండస్ట్రీ టాక్. ఆదిపురుశ్, నాగ అశ్విన్ అతి పెద్ద భారీ ప్రాజెక్టులు. అయినా గాని ప్రభాస్ వాటిని కాకుండా ప్రశాంత్ నీల్ సినిమా చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం బాహుబలి స్థాయిలో ఈ సినిమా స్టోరీ ఉండటం అనే టాక్ వస్తోంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!