Prabhas: పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి విజయంతో… నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో క్రేజ్ రావడంతో ప్రస్తుతం ప్రభాస్.. దేశంలో అన్ని ఇండస్ట్రీలలో ఉన్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సినిమాలు ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో “బాహుబలి” తర్వాత అదే స్థాయిలో విజయం సాధించాలని సాహో చేసిన ప్రభాస్ .. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఫుల్ నిరుత్సాహం చెందడం జరిగింది. దాదాపు రెండు సంవత్సరాలపాటు “సాహో” కి ప్రభాస్ టైం కేటాయించటం పట్ల అభిమానులు కూడా ఎంతగానో బాధ పడ్డారు.
ఫ్లాప్ సినిమాకి ప్రభాస్ అనవసరంగా టైం వేస్ట్ చేశారని అప్పట్లో అనేక కామెంట్లు వచ్చాయి. దీంతో పరిస్థితి అంతా బేరీజు వేసుకొని.. తనకి కలిసొచ్చే లైన్ రొమాంటిక్ తరహాలో రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యాం .. ప్రభాస్ ప్రస్తుతం చేయటం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు ఏడాదికి పైగా అనే జరుగుతూ వస్తోంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు కొన్ని ప్యాచ్ వర్క్ మినహా పూర్తి కావడంతో ఇటీవల.. ప్రభాస్ నిర్మాతలతో కలిసి అవుట్ పూట్ చూడటం జరిగిందట.
Read More: Prabhas: రిలీజ్ అవ్వకుండానే బడ్జెట్ రికవరీ చేసిన ప్రభాస్ సినిమా??
అంతా బాగా ఉండటంతో ప్రభాస్… ఫుల్ హ్యాపీ గా ఉన్నారట. ముఖ్యంగా పూజా హెగ్డే యాక్టింగ్ చాలా హైలెట్ అని.. సినిమా యూనిట్ తో ప్రభాస్ పంచుకున్నట్లు టాక్. కచ్చితంగా సినిమా హిట్ అవడం గ్యారెంటీ అని ప్రభాస్ మంచి నమ్మకం మీద ఉన్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వీడియో ఈనెల 25వ తారీఖున రిలీజ్ చేసి.. అప్పుడు అధికారికంగా సినిమా డేట్ రిలీజ్ ప్రకటించాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!