Bheemla Naayak: నటుడు ప్రకాష్ రాజ్ “బీమ్లా నాయక్” విషయంలో బయట జరుగుతున్న పరిస్థితి గురించి తనదైన శైలిలో స్పందించారు. సమాజంలో ఎటువంటి అంశంపైన అయినా సమర్థవంతంగా మాట్లాడగలిగే ప్రకాష్ రాజ్..బీమ్లా నాయక్ ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన ఇబ్బందుల గురించి తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా సినిమా థియేటర్స్.. ఈ విషయంలో అదే విధంగా టికెట్ రేట్లు ఇంకా నిర్వహించకుండానే ముందుగానే సినిమా విడుదల చేయటం పై.. విమర్శలు వస్తున్న క్రమంలో ప్రకాష్ సోషల్ మీడియాలో ఈ విధంగా రియాక్ట్ అయ్యారు.
“‘సృజన, సాంకేతికత మేళవించిన సినిమారంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి? చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ.. మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మలా? ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు?ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డకట్టవేయలేరు’ అంటూ పేర్కొన్నారు. బీమ్లా నాయక్ ఫిబ్రవరి 25వ తారీకు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం తెలిసిందే. కలెక్షన్లు భారీగా వస్తున్నాయి.
అయితే సినిమా టికెట్ల రేట్లు పెంచుకోకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకుందని పైగా సినిమా థియేటర్స్ వద్ద ప్రభుత్వ అధికారులను పంపించి ఆంక్షలు విధించింది అని.. పవన్ ని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని.. పవన్ అభిమానులతో పాటు టిడిపి నేతలు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే సినిమా టికెట్ల రేట్లు విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకుండానే ముందుగానే సినిమాని రిలీజ్ చేసి.. కావాలని పొలిటికల్ మైలేజ్ కోసం.. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తో కలిసి ఈ విధంగా వ్యవహరించాలని మరోపక్క వైసిపి నేతలు అంటున్నారు. ఏది ఏమైనా రివెంజ్ పాలిటిక్స్ రాజకీయాల్లో చూసుకోవాలి కాని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాదు అంటూ తాజా పరిణామాలపై ప్రకాష్ రాజ్ తన దైన శైలిలో రియాక్ట్ అయ్యారు.