Salaar: ఉగ్రమ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత కేజీఎఫ్ 2 సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ సినిమాతో కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా పాన్ ఇండియన్ స్టార్గా మారాడు. ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ సీక్వెల్ సినిమాను ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రమోట్ చేసి భారీ వసూళ్లను రాబట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. కేజీఎఫ్ సినిమాకు రెట్టింపు స్థాయిలో యాక్షన్ సన్నివేశాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు.
కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ పూర్తి అయినా కూడా విడుదలకు కరోనా వేవ్స్ అడ్డు పడడంతో.. ప్రభాస్ హీరో భారీ యాక్షన్స్ ఎంటర్టైనర్ చిత్రంగా సలార్ సినిమాను ప్రశాంత్ నీల్ మొదలు పెట్టాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి అయినట్లుగా సమాచారం. సలార్ మూవీలో కూడా యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ సినిమా రేంజ్లో ఉంటాయని మేకర్స్ చాలా నమ్మకం గా చెబుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించ నున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Salaar: రూమర్స్కు చెక్ పెట్టారు.
ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించినట్టుగా సలార్ సినిమాను కూడా రెండు భాగాలుగా రూపొందించనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీడియాలో కూడా దీని గురించి జోరుగా ప్రచారం జరగడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వయంగా సలార్ సినిమా విషయంలో మాట్లాడారు. మీడియా ముందు సీక్వెల్ గురించి ఆయన క్లారిటీ ఇచ్చాడు. సలార్ 2 సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల కేజీఎఫ్ 2 ప్రమోషన్ కార్యక్రమంలో ప్రశాంత్ నీల్.. సలార్ సినిమా కథకు సీక్వెల్ అవసరం లేదని.. ఆ కథ విషయంలో అసలు సీక్వెల్ కు ఆస్కారం కూడా లేదని చెప్పుకొచ్చారు. మార్కెట్ కోసమో, వసూళ్ల కోసమో ఈ సినిమాను రెండు పార్ట్ లుగా చేయాలనుకోవడం లేదంటూ రూమర్స్కు చెక్ పెట్టారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!