Tollywood: “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టార్గెట్ మొత్తం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఉన్నట్లు అర్థమవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలతో వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో “సలార్”, అదేరీతిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో… అధికారికంగా ప్రాజెక్టు కాక లైన్ లో రామ్ చరణ్ ఉన్నట్లు నిన్నటి దాకా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా సినిమా చేయటానికి ప్రశాంత్ నీల్ రెడీ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
విషయంలోకి వెళితే ఇప్పటికే ఒకసారి సూపర్ స్టార్ మహేష్ బాబుకి కథ చెప్పినట్లు.. మహేష్ కి కథ నచ్చలేదు అన్నట్టు సమాచారం. అయితే మరో స్టోరీ తో రావాలని ప్రశాంత్ నీల్ కి మహేష్ మరో ఛాన్స్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు సరి కొత్తగా వైరల్ అవుతున్నాయి. ఒక మంచి మాస్ సబ్జెక్ట్ స్టోరీని తీసుకురమ్మని మహేష్ ఆఫర్ చేయడం జరిగిందట.
Read More: Tollywood : మల్టీస్టారర్స్ మీద క్రేజ్ పెరుగుతోంది..బడ్జెట్ కూడా అంతే పెటాల్సి వస్తోంది..!
దీంతో “కేజిఎఫ్” డైరెక్టర్ తాజా ప్రాజెక్ట్ లిస్ట్ బట్టి చూస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలందరితో… టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేయటానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కే జి ఎఫ్ సెకండ్ పార్ట్ తోపాటు ప్రభాస్ సలార్ సినిమాలను చిత్రీకరిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు అయిన తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మాత్రం ప్రశాంత్ నీల్… ఫోకస్ మొత్తం “కేజిఎఫ్’ 2 పైనే ఉందట.