బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ షూటింగులకు విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. తన భర్త సైఫ్ అలీ ఖాన్ తో కలిసి పర్యటనకు వెళ్లారు. ఇద్దరు కలిసి హిల్ స్టేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కరీనా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కరీనా కపూర్ మరో బిడ్డకు జన్మని ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈమె హిమాచల్ ప్రదేశ్ అలంపూర్ కు వెళ్లారు. గురువారం రోజు సైఫ్ జంట పాలంపూర్ నుంచి ముంబైకి తిరిగి వచ్చారు. ఈ సందర్బంగా అక్కడ దిగిన ఫోటోను షేర్ చేస్తూ బై బై పాలంపూర్ అని పోస్ట్ చేశారు. అంతేకాక ఈ జంట తమ స్నేహితులతో పాలంపూర్ లో దిగిన ఫోటోను కరీనా అభిమానులతో షేర్ చేసుకున్నారు.
ఇటీవల ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించిన విషయం తెలిసిందే. కరీనా సరసన నటించిన ఇర్ఫాన్ చివరి చిత్రం “అంగ్రేజీ మీడియం”. ఈ సూపర్ హిట్ చిత్రం ప్రజలను ఎంతగానో అలరించింది. ఆ తర్వాత కరీనా అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చాందలో నటిస్తుంది. అయితే మరోసారి తల్లి కాబోతున్న కరీనా లాల్ సింగ్ చాందాలోని తన షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
కరీనా 2012 లో ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకుంది. ఇప్పటికే వీరికి 3ఏళ్ల కొడుకు తైమూర్ అలీ ఖాన్ ఉన్నాడు. అయితే మరో రెండు నెలల్లో కరీనా రెండవ బిడ్డకు జన్మనివ్వనున్నారు.
https://www.instagram.com/p/CIfE98bJ6EW/?utm_source=ig_web_copy_link
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!