భారతదేశంలో రాజకీయ నాయకులకు మరియు సినిమా స్టార్లకు ఉండే ఫాలోయింగ్ స్వామీజీలకు కూడా ఉంటుంది. ఈ రకంగా మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న స్వామీజీ నిత్యానంద స్వామి. తనని తాను భగవంతుడిగా ప్రకటించుకున్న నిత్యానంద.. దేశంలో అనేక సార్లు వార్తలలో నిలిచారు. అప్పట్లో రంజిత అనే తమిళ్ యాక్టర్ తో రాసలీలలు జరిపిస్తూ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ఆ వీడియో ఇప్పటికి కూడా వైరల్ అవుతూ ఉంటది. అంత మాత్రమే కాదు ఒక దీవి కూడా కొనుగోలు చేసి దానికి కైలాస అనే పేరు పెట్టి ప్రత్యేక దేశాన్ని కూడా నిత్యానంద స్వామి ప్రకటించడం జరిగింది. ఆ దీవికి ప్రత్యేక కరెన్సీ కూడా కేటాయిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా నిత్యానంద స్వామి సమాధిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈనెల 13వ తారీకు గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల ముందుకు రావడానికి ఆయన సిద్ధమైనట్లు ఆయన ఫాలోవర్స్ నుండి టాక్ వినబడుతుంది. మరో పక్క తాను సమాధిలో ఉన్నట్లు త్వరలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు నిత్యానంద పేరిట తరచూ ప్రకటనలు వస్తున్నాయి. ఇలా ఉంటే నిత్యానంద స్వామినీ పెళ్లి చేసుకోవాలని ఉందంటూ ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన చేయడం జరిగింది. ఆమె మరి ఎవరో కాదు ప్రియా ఆనంద్. రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2010వ సంవత్సరంలో వచ్చిన “లీడర్” లో హీరోయిన్ గా నటించింది.
ఆ తర్వాత రామ్ హీరోగా నటించిన “రామ రామ కృష్ణ కృష్ణ”, సిద్ధార్థ హీరోగా తెరకెక్కిన”180″… శర్వానంద్ హీరోగా తెరకెక్కిన “కో అంటే కోటి” సినిమాలలో చేసిన ప్రియా ఆనంద్… స్వామి నిత్యానంద ని పెళ్లి చేసుకుంటానని కామెంట్లు చేయటం సంచలనం అయిపోయింది. అయితే ఆయనపై నెగిటివ్ ప్రచారం ఉన్నా గాని ఇటువంటి కామెంట్లు చేయడం వెనకాల ఉద్దేశ్యమే ఏంటి అని ప్రశ్నిస్తే ఆయన గురించి ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నా సరే.. ఆయనను ఇప్పటికీ వేలాది మంది భక్తులు ఆదరిస్తున్నారని.. ఆరాధిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. అంత మాత్రమే కాదు ఆయనను పెళ్లి చేసుకుంటే గనుక తన ఇంటిపేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదని.. చెప్పుకొచ్చింది. నిత్యానందతో పెళ్లి అయితే తన పేరు ప్రియానంద అంటూ ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీడియా ముఖంగా ప్రియా ఆనంద్ చేసిన ఈ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!