ప్రియారామన్.. రజనీకాంత్ నిర్మాతగా రూపొందించిన `వల్లి` చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయ్యింది ప్రియా రామన్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 50 సినిమాలకుపైగానే నటించి హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సినిమాల తర్వాత సీరియల్స్లోనూ నటించారు. లేటెస్ట్గా ఈమె ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. తిరుపతిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రీసెంట్గా `పడి పడి లేచె మనసు`లో శర్వానంద్ తల్లి పాత్రలో నటించారు. మరి ఈ సీనియర్ హీరోయిన్, నటి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎలా ప్లస్ అవుతారో చూడాలి.
previous post
next post