`పెళ్లిచూపులు`లో అంకుల్.. నా సావు నేను సస్తా నీకెందుకు.. అనే డైలాగుతో పాపులర్ అయిన కమెడియన్ ప్రియదర్శి. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చదివిన ప్రియదర్శి తాను ఎప్పుడూ కమెయిన్ అవుతానని అనుకోలేదట. అసలు ఆ జోనర్ తనది కాదని చెబుతున్నాడు. కాకపోతే కమెడియన్గా చేసిన సినిమాలను మాత్రం ఆస్వాదించే చేశాడట. తనకు నటనతో మెప్పించే విలన్గా పేరు తెచ్చుకోవాలని ఉండేదట.
అందులోనూ ప్రకాష్రాజ్, కోట శ్రీనివాసరావులాగా గొప్ప విలన్ అని అనిపించుకోవాలని ఉండదేట. అందుకే తొలి రెండు చిత్రాలు `టెర్రర్`, `బొమ్మల రామారం`లో విలన్గానే నటించారట. అయితే ఆ తర్వాత ఎవరూ పెద్దగా అవకాశాలు ఇవ్వకపోవడంతో, మిత్రుడు సినిమా `పెళ్లిచూపులు`లో కామెడీ రోల్ చేశాడట. అప్పటి నుంచీ అదే క్లిక్ అయిందని, దాంతో కమెడియన్గా స్థిరపడ్డాననీ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన హీరోగా నటించిన మల్లేశం పాత్రకు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. ప్రీమియర్లు చూసిన వారందరూ పాజిటివ్గానే స్పందిస్తున్నారు. ఈ సినిమా ప్రియదర్శిని హీరోగా నిలబెట్టాలనే ఆశిద్దాం. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనేది సినిమా ఇండస్ట్రీలో ఎందరి విషయంలోనో జరిగిందే. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!