Priyamani: ప్రముఖ నటి ప్రియమణి అంటే తెలియని వారుండరు. `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన `యమదొంగ` సినిమా చేసి స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసిన ప్రియమణి.. కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లోనూ నటించింది.
సినీ కెరీర్ మంచి స్వింగ్ లో ఉండగానే ప్రియమణి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి గప్చుప్గా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నా.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు బుల్లితెరపై పలు టీవీ షోలు కూడా చేస్తూ దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ప్రియమని ట్రోల్స్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ..`సోషల్ మీడియాలో కొందరు ఏం అనాలనిపిస్తే అది అనేస్తుంటారు. ఒక్కోసారి అవి హద్దు మీరుతూ ఉంటాయి. అటువంటి కామెంట్స్ను చూసి నేను అస్సలు భరించలేను. వెంటనే వాళ్లను బ్లాక్ చేసేస్తా.
ఎందుకంటే సోషల్ మీడియానే జీవితం కాదు, అది కేవలం లైఫ్లో ఒక భాగం మాత్రమే. అభిమానులు నన్ను ఇష్టపడ్డా, ఇష్టపడకపోయినా మరేం పర్వాలేదు` అంటూ తన మనసులో బాధంగా ఆమె బయటపెట్టింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి. కాగా, సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఈమె నటించిన `విరాటపర్వం` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించారు.