RC15: సౌత్ ఇండియా టాప్ మోస్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. చరణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ సినిమాలకు లీక్ బెడద గట్టిగా కొడుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే మహేష్ “సర్కారు వారి పాట” సినిమాకి సంబంధించి.. సాంగ్ మొత్తం అనుకున్న రోజు కంటే ముందే… సోషల్ మీడియాలో లీక్ అయి పోయింది.
వాలెంటైన్స్ డే నాడు ఫిబ్రవరి 14 విడుదల చేయాలని భావించక దానికన్నా ముందే ఫిబ్రవరి 13వ తారీకు… కళావతి సాంగ్ రావటం.. “సర్కారు వారి పాట” సినిమా యూనిట్ కి మైండ్ బ్లోయింగ్ అయ్యేటూ చేసింది. ఇటువంటి తరుణంలో చరణ్ సినిమాకి సంబంధించి పనిచేస్తున్న సినిమా యూనిట్ కి.. టెక్నీషియన్లకు డైరెక్టర్ శంకర్ తో పాటు దిల్ రాజు ముందు జాగ్రత్తగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ బహిరంగ ప్రదేశాల్లో.. ముఖ్యంగా జనసందోహం ఎక్కువగా ఉండే చోట చిత్రీకరిస్తూ ఉండటంతో.. ఎటువంటి వీడియో .. ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ జాగ్రత్త పడుతూ ఉంది.
ఇదే సమయంలో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు సినిమా కి సంబంధించి ఎటువంటి పోస్టులు..లీక్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తూనే ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడటం అంటూ సున్నితంగా వార్నింగ్ ఇచ్చింది. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తుండగా… తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది.